ఆన్లైన్ ట్రేడింగ్కు కుటుంబం బలి
మంచిర్యాల: తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) ఆన్లైన్ ట్రేడింగ్కు బలి కావడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. అప్పులు తీసుకొని ఆన్లైన్ ట్రేడింగ్ చేసిన శివప్రసాద్, భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. దీంతో, అప్పుల పేరుతో ఒత్తిళ్లకు గురవడంతో, తన తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
వారిని వరంగల్ ఏంజీఏం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తో కుటుంబసభ్యుల మధ్య తీవ్ర విషాదం నింపింది.
