తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
హైదరాబాద్: డిసెంబర్ 14
తెలంగాణ రాష్ట్రంలో రేపు మరియు ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. OMR పద్ధతిలో మొత్తం 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి.
ప్రధానంగా 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, 5,51,943 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలలో నాలుగు పేపర్లు ఉండి, ప్రతి పేపర్ 150 మార్కుల విలువ కలిగి ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి:
- ఉదయం 10:00 నుండి 12:30 వరకు
- మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు
అభ్యర్థులు ఈ పరీక్షలు సక్రమంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
