మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.మృతులంతా మహిళలేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరో 12 మంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.పూజల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో పరిస్థితి అదుపులో లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
