మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో లీటర్కు రూ.10 వరకు ధరలు పెరగవచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ Emkay Global Financial Services అంచనా వేసింది.ఈ ధరల పెంపు ఒకేసారి లేదా దశలవారీగా అమలు కావచ్చని సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి లీటర్ ఇంధనంపై రూ.17 నుంచి రూ.18 వరకు నష్టపోతున్నాయని వెల్లడించింది.ధరల పెంపు ద్వారా ఆ నష్టాల్లో సుమారు 50 శాతం వరకు భర్తీ చేసుకునే అవకాశం ఉందని నివేదికలో విశ్లేషించింది.
