Breaking News

CM Revanth Reddy Uturn on increase in ticket prices and extra shows

టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్

సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్: పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రూ.500 కోట్లు తీసుకుని, “గేమ్ ఛేంజర్” సినిమాకు అదనపు షోలు మరియు టికెట్ల ధరల పెంపుకు అనుమతించారని ఆయన ఆరోపించారు.

డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను, అల్లు అర్జున్ అరెస్టు వివాదాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో సీఎం, “నా అధికారంలో ఉన్నంత వరకూ సినిమాల టికెట్ల ధర పెంపు, అదనపు షోల‌కు అనుమతించను,” అని గట్టిగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

అయితే, “రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసిన తరువాత, ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని టికెట్ల ధరల పెంపు మరియు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు,” అని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ప్రజలను మోసం చేస్తున్న సీఎం

“సినిమా టికెట్ల ధర పెంపు, అదనపు షోల కోసం అనుమతులు ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు విలువ లేకుండా, ఇప్పుడు తప్పుడు మార్గం ఎంచుకోవడం రాష్ట్ర ప్రజలతో మరింత అవమానం చేయడమే,” అని ఆయన విమర్శించారు.

బ్లాక్ మెయిల్ ఆరోపణ

“తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్, నిర్మాత దిల్ రాజును అడ్డం పెట్టుకుని, సినిమా ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసి, వారు నుంచి రూ.500 కోట్లు తీసుకుని, ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అనుమతి ఇచ్చారు. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సిగ్గుతో ఏం చేయకూడదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

సినిమా ఇండస్ట్రీనూ, ప్రజలను మోసం చేసే ఈ చర్యలను తేల్చేందుకు ప్రభుత్వాన్ని నిలదీయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *