ఢిల్లీ ఫలితాలపై ఎంపీ రఘునందన్ రావు స్పందన
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందిస్తూ,
“కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్లుగా, హస్తినలో బీజేపీ విజయం సాధించడానికి వంద కారణాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
- ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.
- “అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకున్న ఆప్, 12 ఏళ్ల పాలనలో స్కాంలకు కేంద్ర బిందువైంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులపై స్కాంల ఆరోపణలు రావడం ఓటమికి కారణం” అని చెప్పారు.
- “పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలవడంతో ఈ ఘన విజయాన్ని సాధించాం” అని అన్నారు.
- కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్లక్ష్యం చేసినందునే ఢిల్లీ ప్రజలు ఆప్కు గుణపాఠం చెప్పారని విమర్శించారు.
తెలంగాణలోనూ గులాబీ పార్టీ గల్లంతు ఖాయం
రఘునందన్ రావు తెలంగాణ పరిస్థితిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
- “ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాడిద గుడ్డు కొట్టుకుంది. తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)కు కూడా అదే గతి పడుతుంది” అని సెటైర్లు వేశారు*.
- “ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం బీఆర్ఎస్ బలహీనతను సూచిస్తోంది” అని అన్నారు.
