Breaking News

Let's save Telugu language

తెలుగు భాషను కాపాడుకుందాం : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు

విజయవాడ: “తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు” అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలో పాల్గొని ప్రసంగించారు.

జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తెలుగు భాష, సంప్రదాయాల పరిరక్షణ కోసం తుది శ్వాస వరకూ పోరాడిన యోధుడు రామోజీరావు ను చూసి, నేను ఎప్పటికీ గర్వపడుతాను. తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ల మంది మాట్లాడుతుంటే, అది సంగీతంలా వినిపిస్తుంది. తెలుగు భాష అనేది కవితా ధోరణిలో మాట్లాడే అద్భుతమైన భాష. ఇంత అద్భుతమైన మన భాషను, వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర భాషలు, సంస్కృతులు కొల్లగొట్టకుండా కాపాడుకోవాలి” అన్నారు.

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

“తెలుగు భాష మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటేనే మనం గొప్పవారవుతాం. భాష లేకపోతే, చరిత్ర లేకపోతే మన జాతి మనుగడ లేదు. మన సంస్కృతి, భాష చిరకాలం నిలిచి ఉండేలా కృషి చేయాలి” అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

“తెలుగు భాషకు ఎన్టీఆర్ వల్ల పెద్ద గౌరవం వచ్చిందని, ఆయన సమాజాన్ని మేల్కొల్పే రచనలు తెలుగును పరిపుష్టించాయని అన్నారు. ప్రభుత్వాలు, పత్రికలు, టీవీ ఛానళ్లూ తెలుగు అభివృద్ధికి పాటుపడాలని, తమిళనాడు తరహాలో మన పాలకులు కూడా భాషాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

“ప్రజలు భాషాభివృద్ధి కోసం పాటుపడితేనే, మాతృభాష అభివృద్ధి మరియు వైభవం సాధ్యమవుతుందని” జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *