బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలుగు భాషను కాపాడుకుందాం : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

తెలుగు భాషను కాపాడుకుందాం : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు

విజయవాడ: “తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు” అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలో పాల్గొని ప్రసంగించారు.

జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తెలుగు భాష, సంప్రదాయాల పరిరక్షణ కోసం తుది శ్వాస వరకూ పోరాడిన యోధుడు రామోజీరావు ను చూసి, నేను ఎప్పటికీ గర్వపడుతాను. తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియన్ల మంది మాట్లాడుతుంటే, అది సంగీతంలా వినిపిస్తుంది. తెలుగు భాష అనేది కవితా ధోరణిలో మాట్లాడే అద్భుతమైన భాష. ఇంత అద్భుతమైన మన భాషను, వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర భాషలు, సంస్కృతులు కొల్లగొట్టకుండా కాపాడుకోవాలి” అన్నారు.

“తెలుగు భాష మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటేనే మనం గొప్పవారవుతాం. భాష లేకపోతే, చరిత్ర లేకపోతే మన జాతి మనుగడ లేదు. మన సంస్కృతి, భాష చిరకాలం నిలిచి ఉండేలా కృషి చేయాలి” అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

“తెలుగు భాషకు ఎన్టీఆర్ వల్ల పెద్ద గౌరవం వచ్చిందని, ఆయన సమాజాన్ని మేల్కొల్పే రచనలు తెలుగును పరిపుష్టించాయని అన్నారు. ప్రభుత్వాలు, పత్రికలు, టీవీ ఛానళ్లూ తెలుగు అభివృద్ధికి పాటుపడాలని, తమిళనాడు తరహాలో మన పాలకులు కూడా భాషాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

“ప్రజలు భాషాభివృద్ధి కోసం పాటుపడితేనే, మాతృభాష అభివృద్ధి మరియు వైభవం సాధ్యమవుతుందని” జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.