Breaking News

Nomination of Alapati Rajendra Prasad as Graduate MLC

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ – ఎన్డీయే నేతల భారీ ర్యాలీ

గుంటూరు: గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందజేశారు.

ఎన్డీయే నేతల అండ – భారీ ర్యాలీ

ఆలపాటి రాజా నామినేషన్ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు
  • మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి
  • మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, కామినేని శ్రీనివాస్
  • పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు

వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్డీయే కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

“ఆలపాటి సరైన నాయకుడు” – మంత్రి పార్థసారథి

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ:

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
  • “ఆలపాటి రాజా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి” అని పేర్కొన్నారు.
  • “కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తోంది” అని తెలిపారు.
  • “ఉద్యోగ అవకాశాలు, రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది ఎన్డీయే ప్రభుత్వం” అని స్పష్టం చేశారు.
  • “గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చరిత్రలో నిలిచిపోతుంది” అని మండిపడ్డారు.

“జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు”

“జగన్ 1.0 పాలన చూసిన ప్రజలు భయపడ్డారు, 2.0లో ఇంకేం జరుగుతుందోనని జంకుతున్నారు” అని విమర్శించారు.

  • “జగన్ 175 సీట్లు వస్తాయని కలలు కన్నారు, ఫలితాలు చూస్తే మళ్లీ అదే మాటలు మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *