Breaking News

Elephant attack.. ₹10 lakh compensation for the families of the dead

ఏనుగుల దాడి.. మృతుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం

ఏనుగుల దాడి.. మృతుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అమరావతి: మహాశివరాత్రి సందర్భంగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోనలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలిచివేసింది. శివాలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

భద్రతపై కీలక ఆదేశాలు

ఈ ఘటన పునరావృతం కాకుండా అటవీ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని సూచించారు.

ఈ ఘటన భక్తులను కలిచివేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచిచూడాలి.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *