బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు”

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు”

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు” – కేంద్ర మంత్రి బండి సంజయ్

కులగణన (Caste Census)కి తాము వ్యతిరేకం కాదని, అయితే బీసీ హక్కులను తుంగలో తొక్కేలాMuslims – BC లు కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని మేము ఒప్పుకోబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించబోతోందని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తమ ఓటమి ఖాయమని తెలుసు కాబట్టే హడావుడిగా ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“కులగణనలో కుట్ర.. బీసీలకు మోసం”

తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీ జనాభా తగ్గిపోవడం వెనుక కుట్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. “42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. 32% మాత్రమే అమలు చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “బీసీలకు అన్యాయం చేసేందుకు సమగ్ర సర్వేను ప్రభుత్వం పద్దతి ప్రకారం తెచ్చింది” అని మండిపడ్డారు.

“ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు నత్తనడకన?”

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)పై స్పందించిన బండి సంజయ్, “కేసీఆర్ (KCR)ను టచ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదా?” అని సూటిగా ప్రశ్నించారు. “బీఆర్ఎస్ (BRS) నేతల నుంచి కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు వెళ్లాయి కాబట్టే ఈ కేసును నత్తనడకన నడిపిస్తున్నారు” అని సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“27న ఇండియా – పాక్ మ్యాచే.. బీజేపీ గెలుస్తుంది”

ఇండియా – పాకిస్తాన్ (India vs Pakistan) క్రికెట్ మ్యాచ్‌ను పోలుస్తూ, “27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా ఒక ఇండియా – పాక్ మ్యాచ్ లాంటిదే” అని వ్యాఖ్యానించారు. “దేశాన్ని ప్రేమించే వారు, అభివృద్ధి కోరుకునే వారు బీజేపీకి ఓటు వేయాలి” అంటూ ప్రజలను కోరారు.

ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతాయో వేచి చూడాలి!