Breaking News

"We are not against caste census"

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు”

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు” – కేంద్ర మంత్రి బండి సంజయ్

కులగణన (Caste Census)కి తాము వ్యతిరేకం కాదని, అయితే బీసీ హక్కులను తుంగలో తొక్కేలాMuslims – BC లు కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని మేము ఒప్పుకోబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించబోతోందని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తమ ఓటమి ఖాయమని తెలుసు కాబట్టే హడావుడిగా ప్రచారం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“కులగణనలో కుట్ర.. బీసీలకు మోసం”

తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీ జనాభా తగ్గిపోవడం వెనుక కుట్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. “42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. 32% మాత్రమే అమలు చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “బీసీలకు అన్యాయం చేసేందుకు సమగ్ర సర్వేను ప్రభుత్వం పద్దతి ప్రకారం తెచ్చింది” అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు నత్తనడకన?”

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)పై స్పందించిన బండి సంజయ్, “కేసీఆర్ (KCR)ను టచ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదా?” అని సూటిగా ప్రశ్నించారు. “బీఆర్ఎస్ (BRS) నేతల నుంచి కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు వెళ్లాయి కాబట్టే ఈ కేసును నత్తనడకన నడిపిస్తున్నారు” అని సంచలన ఆరోపణలు చేశారు.

“27న ఇండియా – పాక్ మ్యాచే.. బీజేపీ గెలుస్తుంది”

ఇండియా – పాకిస్తాన్ (India vs Pakistan) క్రికెట్ మ్యాచ్‌ను పోలుస్తూ, “27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా ఒక ఇండియా – పాక్ మ్యాచ్ లాంటిదే” అని వ్యాఖ్యానించారు. “దేశాన్ని ప్రేమించే వారు, అభివృద్ధి కోరుకునే వారు బీజేపీకి ఓటు వేయాలి” అంటూ ప్రజలను కోరారు.

ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతాయో వేచి చూడాలి!

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *