Breaking News

TSRTC special buses for Sankranti festival

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది: మంత్రి పొన్నం ప్రభాకర్

మహాలక్ష్మి పథకం ప్రారంభంతో ప్రజలు బస్సులను విస్తారంగా వినియోగిస్తున్నారని, దీంతో రద్దీ గణనీయంగా పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కారణంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40 శాతం నుంచి 100 శాతానికి చేరుకుందని చెప్పారు.

1000 కొత్త బస్సులు కొనుగోలు
మరింత డిమాండ్‌ను తీర్చడానికి 1000 కొత్త బస్సులను కొనుగోలు చేసే ప్రణాళిక ఉందని మంత్రి తెలిపారు. ఈ బస్సులను డ్వాక్రా సంఘాల సహకారంతో కొనుగోలు చేస్తామన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొత్త డిపోల నిర్మాణం
బస్సు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా డిపోలను నిర్మించే ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించారు.

కొరుట్ల, జగిత్యాల, సిరిసిల్లకు అదనపు బస్సులు
ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానమిస్తూ, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలకు అదనపు బస్సులను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి హామీ ఇచ్చారు.

మహాలక్ష్మి పథకం ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *