Breaking News

Steps towards making Universities Saraswati Nilayams

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు: మంత్రి లోకేష్

అమరావతి: ఉన్నత విద్య రంగంలో సమూల మార్పులను తీసుకువస్తున్న నారా లోకేష్, తన చర్యలతో ఆరునెలల్లోనూ అనూహ్య పరిణామాలు సృష్టించారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్య వ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన సంస్కరణలను అమలు చేస్తున్నారు.

గత ఆరునెలలలో నారా లోకేష్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమారు 3,300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ చర్యలు దేశవ్యాప్తంగా ఉన్నత విద్య వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు అవసరమైన కీలక అడుగులుగా భావించబడుతున్నాయి.

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

శ్రీకారం పెట్టిన ఈ సంస్కరణలతో, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలుకు ప్రణాళికలు రూపొందించారు. విద్యావ్యవస్థను మరింత ప్రగతిశీలంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం కోసం పలు చర్యలను తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

ప్రతి విద్యాసంస్థలో పరిశోధన మరియు ప్రమాణాల మెరుగుదలపై దృష్టి పెట్టి, రాష్ట్రానికి అత్యున్నత గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఆరునెలల్లోనే తన మార్పులతో విశ్వవిద్యాలయాలు సరస్వతీ నిలయాలుగా మారే దిశగా ముఖ్యమైన అడుగులు వేసిన మంత్రి లోకేష్, రాబోయే ఐదేళ్లలో ఈ విద్యావ్యవస్థను దేశంలోని మేము ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *