Breaking News

Tiruvuru MLA Kolikapudi's explanation

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ: TDP క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు

ఈనెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇచ్చారు. కమిటీ సభ్యులైన ఎంఏ షరీఫ్, బీసీ జనార్దనరెడ్డి, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ సమక్షంలో కొలికపూడి వివరణ సమర్పించారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలు:
క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన కొలికపూడి, “సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి విరుద్ధం. కంచె తొలగింపు ఘటన యాదృచ్ఛికంగా జరిగింది. కంచె ఉన్న విషయం సంఘటనా ప్రదేశానికి వెళ్లే వరకు నాకు తెలియదు. నాపై ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని ఎవ్వరూ దూరం పెట్టరు. తిరువూరు ప్రజలు అసలు విషయాలు బాగా తెలుసుకుంటారు,” అని తెలిపారు.

ఇరాన్‌పై ఒత్తిడి: ట్రంప్ యురేనియం స్వాధీనం ఆలోచన

ఏం జరిగిందంటే?
జనవరి 11న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎ.కొండూరు మండలం గోపాలపురంలో తెదేపా గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ రాంబాబుతో పాటు ఆయన సోదరుడైన వైకాపా నాయకుడు భూక్యా కృష్ణ మధ్య ఆస్తి వివాదం నెలకొన్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు తమ స్థలంలో వేశారని, వివాదం తేలే వరకు రోడ్డు వినియోగించరాదని కృష్ణ కంచె వేసారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, కంచె తొలగించి రాంబాబు తరఫున మాట్లాడారు. దీంతో కృష్ణ భార్య భూక్యా చంటి ఎమ్మెల్యే, అనుచరులు తన భర్తను వేధించారని ఆరోపిస్తూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

క్రమశిక్షణ కమిటీ విచారణ:
ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెదేపా సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేను వివరణకు పిలిపించింది. కలహాలకు కారణాలు, సంఘటన వాస్తవాలపై ఎమ్మెల్యేను ప్రశ్నించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ట్రంప్ పాలనపై భారీ ఆగ్రహం.. అమెరికా వీధుల్లో జనసంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *