పార్లమెంట్లో నేడు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
“ఒక దేశం, ఒకే ఎన్నిక” అనే ఆలోచనకు మరింత ఊతమిచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, దానిని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ బిల్లు చట్టరూపం దాల్చితే, రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు.
జమిలి ఎన్నికల బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
