ఆర్జీవీ బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్లపై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు గతంలో ఆదేశించింది.
హైకోర్టు, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను డిసెంబర్ 13, శుక్రవారం వరకు పొడిగించింది. ఈ రోజు విచారణలో ఆర్జీవీ పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది.
