Breaking News

Manmohan Singh's last rites on Saturday.. Mourning across the country

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. దేశమంతటా సంతాపం

శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: దేశమంతటా సంతాపం

న్యూఢిల్లీ: భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం అధికారికంగా నిర్వహించనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అక్కడి నుండి ఆయన పార్థివ దేహాన్ని మోతిలాల్ నెహ్రూ మార్గ్‌లోని అధికారిక నివాసానికి తరలించారు.

నివాళులు అర్పించిన నేతలు
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం: నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి

సంతాప దినాలు మరియు క్యాబినెట్ సమావేశం
శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఈరోజు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 7 రోజుల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేసింది. కర్ణాటక ప్రభుత్వం ఈరోజును సెలవుదినంగా ప్రకటించింది.

మన్మోహన్ సింగ్ జీవితయానం
92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 1991లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.

తీవ్ర అస్వస్థత కారణంగా గురువారం రాత్రి 9:51 గంటలకు ఆయన మరణించినట్లు ఎయిమ్స్ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రిమా దాదా ధృవీకరించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటుగా నిలిచింది.

కేంద్రం కొత్త “జనగణ” కార్యక్రమం – సహజీవన జంటలను స్నేహితులుగా నమోదు చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *