Breaking News

AP CM Chandrababu pays tribute to former Prime Minister Manmohan Singh

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

ఢిల్లీ:
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

మన్మోహన్ సేవలు చిరస్మరణీయం:
నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటూ, దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన అవిశ్రాంత సేవలు, అనేక ఉన్నత పదవుల్లోని సమర్థనాయకత్వం ప్రజలకు మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఆర్థిక రంగంలో విప్లవం:
మన్మోహన్ సింగ్ దూరదృష్టితో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపించాయని చంద్రబాబు కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, ఆధార్, ఆర్టీఐ, విద్య హక్కు చట్టం లాంటి పథకాలు ప్రజల జీవితాలను మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌దేనని గుర్తుచేశారు.

గొప్ప నాయకుడికి అశ్రునివాళి:
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతిని తెలియజేశారు. అమాయకత్వం, నిష్కపటత, కష్టపడే తత్వం ఆయన వ్యక్తిత్వానికి నిలువుటద్దాలని వ్యాఖ్యానించారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *