Breaking News

Acceleration of Jinal Ring road works related to Congress government

రింగ్ రోడ్డు పనుల వేగవంతానికి కాంగ్రెస్ సర్కార్‌కు సంబంధం లేదు

రిజినల్ రింగ్ రోడ్డు పనుల వేగవంతానికి కాంగ్రెస్ సర్కార్‌కు సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజినల్ రింగ్ రోడ్డు (RRR) పనులు వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ, ఇందుకు కాంగ్రెస్ సర్కార్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 50% నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత, మిగతా 50% నిధులు సాగరమాల పథకం కింద కేటాయించి, రీజినల్ రింగ్ రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రణాళికలలో ఉన్నామని చెప్పారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రీజినల్ రింగ్ రోడ్డు పనుల పరంగా ఏమైనా అభ్యంతరాలు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం RRRకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కంటే ఇంకా ఆలస్యం జరిగింది అని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా మొదటి దశలో కొంత ఆలస్యం కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఆలస్యం మరింత పెరిగిందని ఆయన ఆరోపించారు.

కేంద్రం RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో, భూసేకరణ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *