Breaking News

The sufferings of the farmers should be taken care of...Who has done it without affordable price?

రైతుల కష్టాలు పట్టవా…గిట్టుబాటు ధర లేకుండా చేసిందెవరు?

గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు.

రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేతగా మిర్చి యార్డుకు వచ్చినా, కనీసం పోలీసు భద్రత కూడా కల్పించలేదని జగన్ మండిపడ్డారు. “ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రత తీసివేస్తే ఎలా?” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు
  • మిర్చి యార్డులో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వంద నుంచి రూ.400 అధికంగా బ్లాక్ మార్కెట్లో ఎరువులు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
  • క్వాలిటీ కంట్రోల్ విభాగం పూర్తిగా విఫలమైందని, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందడం లేదని విమర్శించారు.
  • రైతుల కష్టాలు తీర్చడానికి ప్రతి రైతుకు రూ.20,000 పెట్టుబడి సాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు.
  • ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • “చంద్రబాబు రైతులను దళారులకు అమ్మేశాడు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
  • సీఎం చంద్రబాబు తానే స్వయంగా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల బాధలు వినాలని జగన్ సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *