ఏపీలో పేదలకు శుభవార్త: ఇంటి స్థలాల ప్రాజెక్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్: పేద ప్రజలకు శుభవార్త అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గరీబ్ కుటుంబాలకు ఇంటి స్థలాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ప్రకారం, పట్టణాల్లో గరిష్ఠంగా రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వరకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది.
ఈ ప్రతిపాదనలను వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఈ చర్యతో పేద ప్రజలకు ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం అనేక దశల్లో కృషి చేస్తోంది.
