తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
- చెన్నైలోని మైలాపూర్, వడపళని, కోడంబాక్కం, వంటి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచే తేలికపాటి వర్షం పడుతున్నది.
- కాంచీపురం, చెంగల్పట్టు, వెలూరు, తిరువళ్లూరు, తంజావూరు, తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
- ఈ అల్పపీడన ప్రభావం డిసెంబరు 25వ తేదీ వరకు కొనసాగుతుందని IMD తెలిపింది.
- సముద్రతీరంలో గాలుల వేగం 35-45 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని, ఈ కారణంగా జాలర్లను సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వర్షాలు, ఆ సమయంలో జాలర్లకు ప్రమాదం ఉండవచ్చునని వాతావరణ శాఖ సూచిస్తోంది.