Breaking News

Allu Arjun to Nampally court

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నేటి మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో విచారణ జరుగుతోంది. గతంలో ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

కేసు దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది, అయితే ఈ రిమాండ్‌ నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో, హైకోర్టు ఇటీవల అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

నేటి విచారణ సందర్భంగా, అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు హైకోర్టు ఆదేశాలను కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలపై న్యాయస్థానం ఏం నిర్ణయిస్తుందో అనే దానిపై అందరి దృష్టి ఉంది.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం క్షణక్షణం అప్డేట్స్‌ను అందించనున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *