Breaking News

Union Minister Kishan Reddy is unhappy with the Congress rule - Kishan Reddy

కాంగ్రెస్ పాలనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి

|| Union Minister Kishan Reddy is unhappy with the Congress rule ||

హైదరాబాద్: రాష్ట్రంలో 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదా?

కిషన్ రెడ్డి తన లేఖలో డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారా? అని ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా విడుదల చేయకుండా మానసిక ఒత్తిడికి గురిచేయడం ఎంతవరకు న్యాయం? అని నిలదీశారు.

ఉద్యోగులకు నెలసరి చెల్లింపుల్లో సీలింగ్ విధించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ విధానం స్వచ్చందంగా సేవలందించే ఉద్యోగులకు దారుణ సందేశం ఇస్తోందని విమర్శించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఎన్నికల కోసం మోసపూరిత హామీలపై ఆరోపణలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి మళ్లీ మోసపూరిత హామీలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ. 56,000 బకాయిపడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్

“స్వల్పమైన న్యాయబుద్ధి ఉన్నా, ఈ రోజే రూ. 7,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలి” అని కిషన్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *