Breaking News

Important instructions of MLA Rajasingh on the occasion of Maha Shivratri

మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు

|| Important instructions of MLA Rajasingh on the occasion of Maha Shivratri ||

హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులకు కీలక సూచనలు చేశారు. పూజా సామాగ్రి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పూజా సామాగ్రి హిందువుల వద్దనే కొనాలని విజ్ఞప్తి

ట్విట్టర్ వేదికగా వీడియోను విడుదల చేసిన రాజాసింగ్, శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పూజా సామాగ్రి హిందువుల వద్ద నుంచే కొనుగోలు చేయాలని కోరారు.

పూలు, కొబ్బరికాయలు, స్వీట్లు వంటి పూజా పదార్థాలను హిందువుల వద్ద నుంచే తీసుకోవాలని సూచించారు. “పూజలను ఎంతో పవిత్రంగా నిర్వహిస్తాం. అలాంటప్పుడు, వాటికి అవసరమైన సామాగ్రి కూడా పవిత్రంగా ఉండాలి” అని రాజాసింగ్ అన్నారు.

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

పూజా సామాగ్రి కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలని సూచన

పూజా సామాగ్రి కొనుగోలు చేసే ముందు, ఆ విక్రేత పవిత్రంగా ఉన్నాడా? బొట్టు ధరించాడా? అనే విషయాలను గమనించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. దేవుని అనుగ్రహం మనపై ఉండాలంటే పూజా సామాగ్రి కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్పారు.

“పూజా సామాగ్రి ఎవరివద్ద కొనుగోలు చేస్తున్నామన్నది కూడా మన భక్తికి, మన సంప్రదాయాలకు సంబంధించింది. అందుకే, హిందువుల వద్ద నుంచే కొనుగోలు చేయాలని నేను భక్తులందరినీ కోరుతున్నాను” అని ఎమ్మెల్యే రాజాసింగ్ హితవు పలికారు.

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *