Breaking News

Vallabhaneni Vamsi in police custody for 3 days

వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ

దళితుడిని కిడ్నాప్ కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ

విజయవాడ: దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

కస్టడీ నిబంధనలు

  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే విచారణ.
  • విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలి.
  • లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి.
  • ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు తప్పనిసరి.

జైలులో వసతులపై విచారణ

కోర్టు ఆదేశాల మేరకు వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అరెస్టు నేపథ్యంలో తాజా పరిణామాలు

సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో వంశీని ఈ నెల 13న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యంగా ఇప్పటికే పోలీసులు కొన్ని వీడియోలను సేకరించారు.

వంశీ ఫోన్ ఆచూకీపై దృష్టి

అరెస్టు సమయంలో వంశీ ఫోన్ మాయం కావడంతో పోలీసులు విజయవాడ, హైదరాబాద్‌లలో ఆయన నివాసాలను తనిఖీ చేశారు. రేపటి విచారణలో ఫోన్ ఆచూకీ బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం

ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ రిమాండ్ గడువు నేటితో ముగుస్తోంది. కోర్టులో హాజరయ్యే సమయానికి ఇంకో రెండు పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ కేసులో రిమాండ్ పొడిగించినా లేదా మరో కేసులో అరెస్టు చూపినా వంశీ బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

అయితే, ఇది కక్ష సాధింపు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దళితుడిని కిడ్నాప్ చేయాలని యత్నించినందుకే వంశీని అరెస్టు చేశారని మంత్రులు లోకేశ్, అనితలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *