Breaking News

RK Roja met YS Jagan

వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్కే రోజా

నగరిలో వైసీపీ పరిణామాలు: వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్కే రోజా

తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో శనివారం (ఫిబ్రవరి 24) జరిగిన ఈ సమావేశంలో నగరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

గాలి జగదీష్ ప్రకాష్ చేరికకు రోజా అభ్యంతరం

ఇటీవల వైసీపీ అధిష్టానం గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండవ కుమారుడు గాలి జగదీష్ ప్రకాష్‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, ఆయన చేరికపై ఆర్కే రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ నిర్ణయానికి బ్రేక్ పడింది.

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

జగన్, రోజా భేటీపై ఆసక్తికర చర్చ

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రోజాతో సమావేశమై ఈ అంశంపై కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. గాలి జగదీష్ ప్రకాష్ వైసీపీలో చేరే విషయంలో ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

నగరిలో వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్

ఈ పరిణామాల నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయ పరిస్థితులు ఆసక్తి రేపుతున్నాయి. రోజా అభ్యంతరాలు, జగన్ నిర్ణయం ఏవిధంగా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *